ఆంధ్రప్రదేశ్‌

బాబూ.. థ్యాంక్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 27: రాష్ట్రంలోని రెండు లక్షల మంది ఉపాధ్యాయులకు ప్రయోజనం కలిగే విధంగా ఏకీకృత సర్వీసు రూల్స్‌పై రాష్టప్రతి ఉత్తర్వులు ఇవ్వడం, ఉత్తర్వులు సాధించడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేసిన కృషిని అభినందిస్తూ వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ఉద్యోగ జెఎసి చైర్మన్ పి అశోక్‌బాబు నేతృత్వంలో రాష్ట్రంలోని అన్ని ఉపాధ్యాయ సంఘాలకు చెందిన నేతలు, ఎఫ్‌ఏపిటివో, జెఎసిటివో నేతలు మంగళవారం వెలగపూడి సచివాలయంలోని కార్యాలయంలో మంగళవారం ముఖ్యమంత్రిని కలిసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పి.బాబురెడ్డి మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి ఉపాధ్యాయులు పోరాడిన కల నేడు ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కృషి వల్ల సాధ్యమైందన్నారు. రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరి తరపున ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. జెఎసిటివో కన్వీనర్ ఎం.కమలాకర్, శాసనమండలి సభ్యులు ఎస్.రామకృష్ణ, బొడ్డు నాగేశ్వరరావు, బాలసుబ్రహ్మణ్యం, సూర్యారావు కూడా ముఖ్యమంత్రిని అభినందించి ఉపాధ్యాయుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు.