ఆంధ్రప్రదేశ్‌

విజయవాడలో అదృశ్యమై విశాఖలో ప్రత్యక్షమైన బాలికలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 2: విజయవాడలో అదృశ్యమైన ముగ్గురు ఇంటర్ విద్యార్థినులు విశాఖలో ప్రత్యక్షమయ్యారు. విజయవాడ సూర్యారావు పేట బిషప్ అజరయ్య హాస్టల్‌కు చెందిన వీరు శనివారం కాలేజ్‌కు వెళ్లి తిరిగి చేరుకోలేదు. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న వీరు తిరిగి రాకపోవడంతో హాస్టల్ నిర్వాహకులు విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెల్‌ఫోన్ వినియోగించవద్దని హాస్టల్ నిర్వాహకులు మందలించడంతో పరారైనట్టు పోలీసు విచారణలో తేలింది. అదృశ్యమైన విద్యార్థినుల సమాచారాన్ని విశాఖలో పోలీసులకు తెలుపగా, గాలించారు. విశాఖలో ఉన్న వీరిని తిరిగి విజయవాడకు సురక్షితంగా పంపించివేశారు.