ఆంధ్రప్రదేశ్‌

సిట్ విచారణతో వైసిపిలో గుబులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 2: రాష్ట్రంలో వైసిపి నాయకుల పరిస్థితి చూస్తుంటే దొంగే దొంగా.. దొంగా అన్నట్టుగా ఉందని అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ ఆరోపించారు. విశాఖ భూదందాపై సిట్ విచారణ ప్రారంభం కావడంతో తల్లి, పిల్ల కాంగ్రెస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. 2014కు ముందు జరిగిన తమ భూబాగోతాలు సిట్ విచారణలో వెలుగులోకి వస్తాయనే భయంతో ఓవైపు లోపల భయపతున్న వైసిపి మరోవైపు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోందని విమర్శించారు. విచారణలో ఎక్కడ తమపేర్లు బయటికి వస్తాయోనని వైకాపా నాయకులు సిట్ వద్దని గగ్గోలు పెడుతున్నారన్నారు. విశాఖ భూ అక్రమాలపై గగ్గోలు పెడుతున్న జగన్ సిట్‌కు ఆధారాలు ఎందుకు చూపలేకపోతున్నారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్‌పై ఉన్న కేసుల్లో 9 కేసులు భూకుంభకోణాలకు సంబంధించినవేనని గుర్తుచేశారు.