ఆంధ్రప్రదేశ్
సచివాలయ ఆర్థిక శాఖ ఉద్యోగుల ఆందోళన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 4 July 2017
విజయవాడ, జూలై 3: పదోన్నతుల్లో తమకు అన్యాయం జరుగుతోందంటూ ఆర్థిక శాఖ ఉద్యోగులు సచివాలయంలో సోమవారం ఆందోళనకు దిగారు. సచివాలయ ఉద్యోగుల సహకార సంఘం ఆవరణలో ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ తమను పట్టించుకోవడం లేదని, దీంతో తమకు పదోన్నతుల్లో అన్యాయం జరుగుతోందంటూ ఆరోపించారు. మురళీకృష్ణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు న్యాయం జరగపోతే, తమ ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.