ఆంధ్రప్రదేశ్‌

‘మావో నేత కాకరాల పద్మను కోర్టులో ప్రవేశపెట్టాలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 3: చెన్నైలో ఆంధ్రా పోలీసులు సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్న మావోయిస్టు నేత కాకరాల పద్మను తక్షణం కోర్టులో ప్రవేశ పెట్టాలని ఎపిసిఎల్‌సి రాష్ట్ర అధ్యక్షుడు వేడంగి చిట్టిబాబు డిమాండ్ చేశారు. పద్మ ఏవైనా నేరాలు చేసివుంటే కోర్టులో ప్రవేశపెట్టాలని, ఆమె ప్రాణానికి హాని వుందని చిట్టిబాబు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి పద్మను ఆంధ్రా పోలీసులు చెన్నైలో అదుపులోకి తీసుకున్నారని, తక్షణం ఆమె అరెస్టును ప్రకటించాలని డిమాండ్ చేశారు. తక్షణం కోర్టులో ప్రవేశ పెట్టాలని వేడంగి చిట్టిబాబు కోరారు.