ఆంధ్రప్రదేశ్‌

కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 3: సదావర్తి సత్రం భూములను తక్కువ ధరకే టిడిపి నేతలు కొట్టేయాలని చేసిన ప్రయత్నాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకరించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి విమర్శించారు. ఆభూములపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు. హైకోర్టు తీర్పు ప్రకారం తాము డబ్బులు కడతామని తెలిపారు. సదావర్తి సత్రం భూములపై వాస్తవాలు వెలుగులోకి రావడంతో చంద్రబాబు ఎదురు దాడికి దిగారని ఆయన చెప్పారు. దుర్గమ్మ దేవాలయం భూములు కూడా తక్కువ ధరకే చంద్రబాబు తనకు తెలిసినవాళ్ళకు కట్టబెట్టాలనుకుంటున్నారని, వీటిపై కూడా తాము పోరాటం చేస్తామని ఆళ్ళ తెలిపారు.