ఆంధ్రప్రదేశ్‌

కేంద్రాన్ని సిఎం నిలదీయాలి: సిపిఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 5: రాష్ట్రానికి నమ్మక ద్రోహం చేసిన బిజెపితో అనుబంధంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తన వైఖరిని స్పష్టం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాను సాధిస్తామని, రాష్ట్భ్రావృద్ధి కోసమే బిజెపితో పొత్తు పెట్టుకున్నట్లు చెప్పుకొచ్చిన సిఎం చంద్రబాబు ప్రజాభిప్రాయం మేరకు కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. ఇందుకు ప్రతిపక్ష పార్టీలను కూడా కలుపుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. విజయవాడలో మధు మాట్లాడుతూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు టిడిపి సిద్ధమైతే సిపిఎం సహకారం అందిస్తుందని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదంటూ కేంద్ర మంత్రులే పార్లమెంట్ సాక్షిగా కుండబద్దలు కొట్టారన్నారు. గత ఎన్నికల ప్రచారంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తామని టిడిపి, బిజెపి హామీలిచ్చాయన్నారు. విభజన చట్టంలోని అంశాలు, ఎన్నికల హామీలను అమలు చేయటంలో కేంద్రం పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. రెండేళ్లపాటు బిజెపి నమ్మక ద్రోహానికి పాల్పడిందన్నారు. రాష్ట్రానికి ఇంత అన్యాయం జరిగిన తర్వాత కూడా టిడిపి తన వైఖరిని స్పష్టం చేయకపోతే మోసంలో ఆ పార్టీకి సంబంధం ఉందని అనుమానించాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్భ్రావృద్ధి, ప్రజా సంక్షేమం తమకు ముఖ్యమని అందుకే వామపక్షాలతోపాటు కలిసొచ్చే పార్టీలు, ప్రజాతంత్రశక్తులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సమాయత్తం అవుతున్నట్లు మధు తెలిపారు.