ఆంధ్రప్రదేశ్‌

జగన్ హామీలతో టిడిపిలో అలజడి: రోజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 11: వైకాపా రాష్ట్ర ప్లీనరీలో పార్టీ అధ్యక్షుడు జగన్ ప్రకటించిన నవరత్నాల్లాంటి హామీలను చూసి టిడిపికి నవరంధ్రాల్లో అలజడి పుడుతోందని వైకాపా నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఆమె విలేఖరులతో మాట్లాడారు.జగన్ హామీ ఇచ్చాడు అంటే అది అమలు చేయడం కోసమేనని ప్రజలకు బాగా తెలుసన్నారు. తామిచ్చిన హామీలు నెరవేర్చలేమని బాబు భావిస్తే ఆయన పదవికి రాజీనామ చేసి ప్రభుత్వం జగన్‌కు అప్పగిస్తే ఎలా అమలు చేయాలో చేసి చూపిస్తారన్నారు. హామీల అమలుపై అసెంబ్లీలో చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఎన్నికలకు ముందు టిడిపి ప్రజలకు ఇచ్చిన 600 హామీలు అమలు చేయకపోవడానికి కారణాలు చెప్పి, బాబు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేశారు. తండ్రి కొడుకులు తాము నిప్పని చెప్పుకుంటున్నారని వాస్తవానికి వారు తుప్పుని ఎద్దేవాచేశారు. తండ్రి, కొడుకులు తాము నిప్పనుకుంటే ఇసుక దోపిడి, విశాఖ భూకుంభకోణం, మద్యం వ్యాపారులకు ఇచ్చిన లైసెన్స్ అవకతవకలపై సిబిఐ విచారణకు సిద్ధంకావాలని డిమాండ్ చేశారు.