ఆంధ్రప్రదేశ్‌

బిటెక్ విద్యార్థి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం, జూలై 11 : విజయవాడలోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న తురక సాంబయ్య (19) మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విజయవాడలో చదువుతున్న సాంబయ్య ఆదివారం ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని పెద్దనాగులవరం గ్రామంలోని ఇంటికి వచ్చి ముభావంగా ఉండటంతో తల్లిదండ్రులు ప్రశ్నించినప్పటికీ ఏమీ చెప్పలేకపోయాడు. అయితే మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటన స్థలంలో సాంబయ్య రాసిన సూసైడ్‌నోట్‌లో కళాశాలకు చెందిన గణిత అధ్యాపకుడు విద్యార్థుల ఎదుట కొట్టడంతో మనస్తాపానికి గురై తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని పేర్కొన్నాడు. తన ఆత్మహత్యకు పూర్తి వివరాలు కావాలంటే కళాశాలలో ఉన్న తన డైరీని పరిశీలించాలని రాసినట్లు పోలీసులు తెలిపారు.