ఆంధ్రప్రదేశ్‌

తుపాను షెల్టర్ల నిర్వహణ డ్వాక్రా గ్రూపుల చేతికి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 11: రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు చంద్రబాబు సర్కారు మరో పెద్ద బాధ్యత కట్టబెట్టనుంది. తుపాను షెల్టర్ల నిర్వహణ ఇకపై మహిళా సంఘాలే చూడనున్నాయి. ఇప్పటి వరకూ ఉన్న తుపాను కేంద్రాల నిర్వహణ తీరును బట్టి వాటిని బహుళ ప్రయోజనకారిగా మార్చాలన్న సర్కారు లక్ష్యానికి డ్వాక్రా బృందాలు సహకరించనున్నాయి. ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సహాయంతో ఆంధ్రప్రదేశ్‌లోని 9 తీరప్రాంత జిల్లాల్లో 138 అత్యాధునిక సైక్లోన్ షెల్టర్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టనుంది. 7.18 లక్షల మందికి దీనివల్ల ప్రయోజనం కలుగనుంది. 960 కిమీ పొడవున సముద్ర తీరమున్న రాష్ట్రంలో తరచూ తుపానులు సంభవించడంతో 1977 దివిసీమ ఉప్పెన తరువాత రాష్ట్రంలోని 1142 తుపాను షెల్టర్లను ప్రభుత్వం నిర్మించింది. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఉన్నవాటికి తరచూ నిర్వహణ, మరమ్మతులు లేకపోవడంతో చాలాకాలంగా అవి నిరుపయోగంగా మారాయి. తిరిగి వీటిని పునరుద్ధరించాలని, వినియోగంలోకి తేవాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అయితే, కొంతకాలంగా కోస్తా జిల్లాల్లో అమలవుతున్న పలు అభివృద్ధి పనులు, తరచూ సంభవిస్తున్న ప్రకృతి వైపరీత్యాల కారణంగా విధ్వంసాలకు గురవుతున్నాయని గుర్తించిన ప్రపంచ బ్యాంకు ఇందులో తానూ భాగస్వామ్యం తీసుకోవడానికి ముందుకు వచ్చింది. కోస్తా జిల్లాల జనాభాలో 40 శాతం సముద్ర వాతావరణ ప్రభావిత ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే రూ.771 కోట్లు వడ్డీలేని రుణాన్ని ఇవ్వడానికి ప్రపంచ బ్యాంకు ముందుకొచ్చింది. అయితే, ఈ సామాజిక, ఆశ్రయ భవనాల నిర్వహణ బాధ్యత స్థానిక సమాజాలకే అప్పగించాలని ప్రపంచ బ్యాంకు సూచించింది. దాంతో ప్రభుత్వం కమ్యూనిటీ బేస్డ్ సైక్లోన్ సెంటర్ మేనేజ్‌మెంట్ మెయింటెనెన్స్ వెల్ఫేర్ కమిటీలను నియమించాలని ప్రతిపాదించింది. తీర ప్రాంతంలో నిర్మిస్తున్న కొత్త తుఫాను షెల్టర్ల నిర్వహణ బాధ్యతలను గ్రామ సంఘాలకు అప్పగిస్తూ జూలై 2015లో ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇప్పడు ఈ తుపాను షెల్టర్ల నిర్వహణ, జమా ఖర్చులు తదితరాలకు అవసరమైన శిక్షణా కార్యక్రమాల నిర్వహణ ‘సెర్ప్’ త్వరలో చేపట్టనుంది. కాగా నూతన నిబంధనల ప్రకారం ఈ తుఫాను షెల్టర్లను తుపానులు వచ్చినప్పుడు మాత్రమే షెల్టర్లుగా వాడాలి. తరువాత ఏడాది పొడవునా పాఠశాల భవనాలు లేనిచోట తరగతి గదులుగాను, అవసరమైనప్పుడు ఫంక్షన్లకు అద్దెకు ఇవ్వడం, అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ, స్థానిక వృత్తిపనివారు వినియోగించుకోవడానికి శిక్షణ తరగతులు, వైద్య శిబిరాలు నిర్వహణ వంటి సామాజిక అవసరాలకు వినియోగిస్తారు. 2000 చదరపు గజాల ప్రాంగణాల్లో 3వేల చదరపు అడుగుల బిల్డప్ ఏరియాలో ఒకేసారి 1500 మంది ఆశ్రయం పొందే విధంగా వీటిని నిర్మిస్తారు. వీటిలో ఒక కంట్రోల్ రూం, హ్యామ్ రేడియో, బయట ప్రాంతం సమాచారం తెలుసుకోవడానికి వైర్లెస్ సెట్ ఉంటాయి. మూడు అంతస్తుల్లో ఉండే ఈ భవనాల్లో కింది అంతస్తుల్లో స్థానికులు ఆశ్రయం పొందే రోజుల్లో తమ పశువుల్ని ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. పైన వెయిటింగ్ హాళ్లు, వంట గది, స్ర్తి, పురుషులకు వేర్వేరుగా టాయిలెట్లు ఉంటాయి. ఈ భవనాల వద్దకు చేరుకోవడానికి రోడ్లు, వంతెనలు కూడా నిర్మిస్తారు. శ్రీకాకుళం-34, విజయనగరం-4, విశాఖపట్టణం-17, తూర్పుగోదావరి-19, పశ్చిమగోదావరి-6, కృష్ణా-9, గుంటూరు-8, ప్రకాశం-8, నెల్లూరు-25 తుపాను షెల్టర్లు నిర్మించనున్నారు.