ఆంధ్రప్రదేశ్‌

వారసత్వ రాజకీయాలే దిక్కా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 11: రాష్ట్రంలో వారసత్వ రాజకీయాలే దిక్కనే పరిస్థితులను అధికార, ప్రతిపక్ష పార్టీలు టిడిపి, వైసిపిలు కల్పిస్తున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉన్నదా.. వంశపారంపర్య పాలనను ప్రత్యేకంగా రాష్ట్రానికిచ్చారా.. అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయన్నారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కాగా సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు ఈనెల 17,18 తేదీల్లో ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో జరుగుతున్నాయని ఆయన తెలిపారు. పార్టీ జాతీయ కార్యదర్శి కె.నారాయణ హాజరయ్యే ఈ సమావేశాల్లో రాష్ట్ర రాజకీయాలతోపాటు దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కూలంకుషంగా చర్చిస్తామన్నారు.