ఆంధ్రప్రదేశ్‌

అంబులెన్స్, ప్రైవేటు బస్సు ఢీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం,, జూలై 13: విశాఖ జిల్లా దాకమర్రి పంచాయతీ పరిధిలోని లెండి కళాశాలకు సమీపంలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృత్యువాతపడగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. గురువారం సాయంత్రం 4.45 గంటల సమయంలో లెండి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన బస్సు విజయనగరం నుంచి విశాఖపట్నం వైపు వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న అంబులెన్స్ ఢీకొంది. ఈ సంఘటనలో అంబులెన్స్‌లో ఉన్న బాడంగి మండలం వీరసాగరానికి చెందిన సత్యం, అన్నపూర్ణ, మరొకరు మృత్యువాతపడగా, డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. తీవ్రగాయాలపాలైన అంబులెన్స్ డ్రైవర్‌ను స్థానిక తిరుమల ఆసుపత్రిలో చేర్పించారు. ఈ సంఘటన జరిగిన వెంటనే డెంకాడకు చెందిన ఎస్సై కృష్ణవర్మ పోలీసు సిబ్బందితో వెళ్లి గాయాలపాలైన డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.