ఆంధ్రప్రదేశ్
గరగపర్రులో అశాంతిని ప్రేరేపిస్తున్న ప్రతిపక్షాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 14 July 2017
గుంటూరు, జూలై 13: ప్రశాంతంగా ఉన్న గరగపర్రులో ప్రతిపక్షాలు అశాంతిని ప్రేరేపిస్తున్నాయని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరరావు ధ్వజమెత్తారు. దళితుల వెలివేత దుర్మార్గమని ప్రభుత్వం గుర్తించి అందుకు తగిన చర్యలు చేపట్టిందని, శాంతియుతంగా ఇరువర్గాల మధ్య సమస్యను పరిష్కరించే దిశగా కార్యాచరణ రూపొందిస్తే, రాజకీయ లబ్ధికోసం వైఎస్ఆర్ కాంగ్రెస్, వామపక్ష పార్టీలు శాంతిభద్రతలకు విఘాతం కల్గించేందుకు కుట్ర పన్నుతున్నాయని గుంటూరులో గురువారం జరిగిన విలేఖరుల సమావేశంలో జూపూడి మండిపడ్డారు. వామపక్షాల తీరు మార్చుకోవాలని హితవుపలికారు.