ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ దంపతులు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
లింగపాలెం, జూలై 15: పశ్చిమగోదావరి జిల్లా మండల కేంద్రం లింగపాలెం గ్రామ శివారులో శనివారం జరిగిన మధ్యాహ్నం రోడ్డు ప్రమాదంలో చింతలపూడి ఎస్సై బాణావతు సైదానాయక్ (33), భార్య శాంతి (31)లు మృతిచెందారు. చింతలపూడి నుంచి ఏలూరు కారులో ప్రయాణిస్తుండగా లింగపాలెం వద్ద కారు చెట్టును ఢీకొనడంతో వీరిద్దరూ దుర్మరణం పాలయ్యారు. ఎస్సై సైదానాయక్ సంఘటనా స్థలంలోనే మృతిచెందగా, ఆయన భార్యను ఏలూరు ఆశ్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఎస్సై కుమార్తె (రెండు సంవత్సరాలు)కు స్వల్ప గాయాలయ్యాయి. 2012 బ్యాచ్కు చెందిన సైదానాయక్ బుట్టాయగూడెం, ఏలూరు స్పెషల్ బ్రాంచ్ల్లో పనిచేసి, ప్రస్తుతం చింతలపూడి ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. ఎస్సై మృతిపట్ల పోలీసు శాఖ అధికారులు, సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
చిత్రం.. ఎస్ఐ సైదానాయక్ మృతదేహం