ఆంధ్రప్రదేశ్‌

ఎన్నికల విధులకు వచ్చిన గుంటూరు కానిస్టేబుల్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల టౌన్, ఆగస్టు 22: నంద్యాల ఉప ఎన్నికల్లో విధి నిర్వహణకు వచ్చిన ఎఆర్ కానిస్టేబుల్ ఉమామహేశ్వర్‌రావు (37) మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు. గుంటూరు రూరల్ పోలీసుస్టేషన్‌లో పనిచేస్తున్న ఎఆర్ కానిస్టేబుల్ ఉమామహేశ్వర్‌రావు ఉప ఎన్నిక సందర్భంగా బందోబస్తు కోసం నంద్యాల పట్టణానికి వచ్చాడు. ఆయనకు కేటాయించిన విశ్వవాణి బిఇడి కళాశాల విడిదిలో విధులకు హాజరయ్యేందుకు సిద్ధపడుతుండగా అకస్మాత్తుగా కిందపడిపోయాడు. అక్కడే ఉన్న సహచరులు చికిత్స నిమిత్తం ప్రైవేటు నర్సింగ్‌హోంకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

*చిత్రం..ఉమామహేశ్వర్‌రావు