ఆంధ్రప్రదేశ్‌

నిలకడగా గోదావరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఆగస్టు 22: గోదావరి నది వరద ఉద్ధృతి నిలకడగా సాగుతోంది. అఖండ గోదావరి నది ఎగువ ప్రాంతాల్లో వరద నీటి ప్రవాహ ఉద్ధృతి నిలకడగా ఉండటంతో ధవళేశ్వరం వద్ద కూడా మంగళవారం సాయంత్రానికి నిలకడగా మారినప్పటికీ ఇన్‌ఫ్లో 3 లక్షల క్యూసెక్కులు ఉంది. ధవళేశ్వరం బ్యారేజి నుంచి మంగళవారం 2.5 లక్షల క్యూసెక్కుల వరద జలాలను సముద్రంలోకి విడుదలచేశారు. ధవళేశ్వరం బ్యారేజి వద్ద 10.90 అడుగుల నీటి మట్టం నమోదు కాగా అదే దశలో భద్రాచలం వద్ద 21.70 అడుగుల నీటి మట్టం నమోదైంది. బ్యారేజి 175 గేట్లను 0.5 మీటర్ల మేరకు ఎత్తివేసి వరద జలాలను సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. తూర్పు డెల్టాకు 4,500 క్యూసెక్కులు, మధ్య డెల్టాకు 1,900 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 4000 క్యూసెక్కుల జలాలను సాగు నీటి కాల్వలకు విడుదల చేశారు. కాళేశ్వరం వద్ద 5.46, దుమ్ముగూడెం 7.08, కూనవరం 8.03, కుంట 5.57, కొయిదా 10.18, పోలవరం 7.46 మీటర్ల నీటి మట్టం నమోదైంది.