ఆంధ్రప్రదేశ్‌

ఎర్రచందనం స్మగ్లర్ల ముఠా అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఆగస్టు 28: ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడే అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను నెల్లూరు టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ సోమవారం విలేఖరులకు తెలిపారు. మొత్తం 21 మంది సభ్యులున్న ముఠాను పట్టుకున్నామని, వీరిలో ఇద్దరు పేరుమోసిన అంతరాష్ట్ర స్మగ్లర్లు సందింటి సుబ్బయ్య, సాదినేని సుబ్బయ్య ఉన్నారు. వారి వద్ద నుండి 1.1టన్నుల ఎర్రచందనం దుంగలు, 11 వాహనాలు, 13 సెల్‌ఫోన్లు, రెండు నాటు తుపాకీలు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.కోటి వరకు ఉంటుందని ఎస్పీ తెలిపారు. టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేశాక ఒకటిన్నర నెలల కాలంలో ఇప్పటిదాకా 17 కేసుల్లో 84 మందిని అరెస్ట్ చేసి 9.8 టన్నుల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.