ఆంధ్రప్రదేశ్‌

బాబు పాలనపై జనం సంతృప్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 28: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్, రోజాలతో అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేయిస్తే మాదే విజయమని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. నంద్యాల ఫలితంతో కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధం ఉండదని, అక్కడా భారీ మెజారిటీతో గెలవబోతున్నామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. టిడిపి మూడేళ్ల పాలనకు నంద్యాల ఉప ఎన్నిక ఫలితం నిదర్శనమని మంత్రి చెప్పారు. ప్రజలు చంద్రబాబు పాలనపై సంతృప్తిగా ఉన్నారని మరోసారి స్పష్టమైందని సోమవారం మీడియాతో అన్నారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు చంద్రబాబు పడుతున్న కష్టాన్ని నంద్యాల ప్రజలు గుర్తించారని చెప్పారు. ఉప ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి వాడిన భాష ప్రజలకు ఆగ్రహం తెప్పించిందని, అదే ఫలితాల్లో స్పష్టమైందని వ్యాఖ్యానించారు. వైకాపా సంస్కృతి ఎలాంటిదో రోజా లాంటి నేతలను చూస్తేనే తెలుస్తుందని అన్నారు.