ఆంధ్రప్రదేశ్‌

ఎంపిలతో రాజీనామా చేయించు.. తేల్చుకుందాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఆగస్టు 28: వైసిపి అధినేత జగన్‌మోహన్‌రెడ్డి తన పార్టీ ఎంపిలతో రాజీనామా చేయించి ఎన్నికలకు సిద్ధపడితే తాము అక్కడ తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు సవాల్ విసిరారు. నంద్యాల ఉప ఎన్నిక ఫలితం తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఇచ్చిన తీర్పు అని వ్యాఖ్యానించారు. సోమవారం చంద్రబాబు సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. అవి మాటల్లోనే...
‘ఎంపీలతో రాజీనామా చేయిస్తానని జగన్ ఉబలాటపడ్డాడు. మాట తప్పని, మడమతిప్పని వంశమన్నాడు. ఎన్నికలని ఊరేగుతున్నాడు. ముందు ఎంపీలతో రాజీనామా చేయించమనండి. ఆ ఎన్నికల్లో తేల్చుకుందాం. నంద్యాలలో గెలుపు టిడిపికి శక్తి నిచ్చింది. మూడేళ్లలో మేము చేసిన అభివృద్ధిని స్వాగతించారు. ఎన్నికల కమిషన్ రిఫరీగా ఉండాలి. చెక్స్, బ్యాలెన్సులు చూసుకోవాలి. పక్షపాత ధోరణి చూపొద్దు. ఈసీ నుంచి వచ్చిన ఉత్తర్వులను పంపడంలో జాప్యమెందుకు చేశారు? ఇద్దరినీ సమానంగా చూడకపోతే ఇబ్బందులు తప్పవు. అఫిడవిట్లు తెల్లకాగితాలపై రాసి ఇస్తే ఉపయోగమేమిటి? ఈసీ ఉత్తర్వులపై అధ్యయనం చేసి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తాం’ ‘ఇది చారిత్రాత్మక విజయం. ఈ గెలుపును ముందే ఊహించాను. విజయం సాధిస్తామని గట్టి నమ్మకంతో ఉన్నా. నేను ఎన్నికలను మొదటిసారి ఎదుర్కోలేదు. కొత్తగా వచ్చినవాళ్లు అర్థం కాకుండా అటు పరిగెత్తి, ఇటు పరిగెత్తి, ఏమి వెతుక్కోవాలో తెలియకుండా తత్తరపడ్డారు. ఏపికి న్యాయం చేస్తామన్న నమ్మకంతోనే 2014 ఎన్నికల్లో టిడిపిని ప్రజలు గెలిపించారు. అవకాశవాద రాజకీయాలతో విశ్వసనీయత రాదు. మన నడవడికను బట్టే వస్తుంది. శోభానాగిరెడ్డి చనిపోతే మేం అభ్యర్థిని నిలబెట్టలేదు. అభివృద్ధి, సంక్షేమానికి నంద్యాల ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. మా పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి అపూర్వ విజయం పట్ల ఆనందంగా ఉంది. ఈ విజయం అభివృద్ధికి నిదర్శనం. నంద్యాలలో జగన్ 13 రోజులపాటు బసచేసి ప్రలోభాలకు పాల్పడినా, ప్రజలు తిరస్కరించారు. ముఖ్యమంత్రిని నడిరోడ్డుపై కాల్చేయాలి, ఉరితీయాలి అని జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో ఆందోళన కలిగించాయి. నంద్యాల ఫలితం రాబోయే ఎన్నికలకు నిదర్శనం. దీన్ని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులు మరింత వేగవంతం చేస్తాం. జనసేన ఓ నిర్ణయం తీసుకుంది. దానిపై స్పందించను. ఉద్దానం సమస్యను నా దృష్టికి తీసుకొస్తే వెంటనే స్పందించా. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే విద్యుత్ సమస్యను పరిష్కరించి, మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దడం, పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను కృష్ణాతో అనుసంధానం చేయడం, పురుషోత్తపట్నం పూర్తిచేయడం, సుమారు 13వేల కిలోమీటర్లు సిమెంటు రోడ్లు నిర్మించడం, పెన్షన్ రూ.1000కి పెంచడం, రైతులకు రుణమాఫీ చేయడం, ఏ నెలకు ఆ నెల స్కాలర్‌షిప్‌లు ఇవ్వడం వంటి పనులు ప్రజలను ఆలోచింప చేశాయి. ప్రతిపక్ష నాయకులు చేసిన అసత్య ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ప్రతిపక్ష నాయకుడు విశాఖలో సిఐఐ సదస్సును అడ్డుకునే ప్రయత్నం చేయడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ఎన్నికల సమయంలో నేరాలు, అవినీతి, అరాచక పాలనకు ఓటు వేస్తారో, అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనకు ఓటు వేస్తారో తేల్చుకోవాలని పిలుపు ఇచ్చా. ప్రజలు కూడా సానుకూలంగా స్పందించారు. పట్టణంలోనే కాదు, గ్రామీణ ప్రాంతంలో కూడా టిడిపికి మెజార్టీ వచ్చిందంటే ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఉన్న సానుకూలతే కారణం’ ‘ప్రతిపక్ష నాయకుడు బాధ్యత లేకుండా ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం వల్లే ఈ ఉప ఎన్నిక ఫలితంపై జాతీయస్థాయిలోనూ ఆసక్తి కలిగింది. ఆ వ్యాఖ్యలను ఎన్నికల కమిషన్ తప్పుపట్టినా ప్రతిపక్ష నాయకుడు వాటిని సరిచేసుకోకుండా మరింత రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం ప్రజల్లో ఆందోళన రేకెత్తించింది. ప్రతిపక్ష నేత చేసిన కామెంట్లను ప్రజలు వ్యతిరేకించారు. ఆయన హద్దులు దాటి మాట్లాడారు. అభివృద్ధి పనులు జరుగుతుంటే ఏమీ లేవన్నవారికి నంద్యాల ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారు. ‘రాష్ట్రంలోనూ వివిధ ఎన్నికలు ఒకేసారి జరగాలని భావిస్తున్నాం. అంతే తప్ప మేం ఎన్నికలకు వ్యతిరేకం కాదు. ప్రభుత్వం అభివృద్ధిని కోరుకుంటుంటే ప్రతిపక్షం ఎన్నికలను కోరుకుంటోంది. డేరా బాబా మంచి సంస్థను చేతుల్లో ఉంచుకుని నమ్మిన మహిళల్ని మోసం చేశారు. సంస్థలో మిలిటెంట్స్‌ను తయారుచేశారు. సాధువు రూపంలో ఎన్ని దుర్మార్గాలు చేయాలో అన్నీ చేశారు. ప్రతిపక్ష నాయకుడు కుటుంబం వల్లే అధికారులు, పారిశ్రామికవేత్తలు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. రాష్ట్రానికి జాతీయస్థాయిలో చెడ్డపేరు వచ్చింది. ఆల్మట్టి ప్రాజెక్టులోని నీటి వాడకం మీద కోర్టుకి వెళ్లే విషయాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించాం’.