ఆంధ్రప్రదేశ్‌

ఎయిర్‌ఫోర్స్ ‘పరుగు’లో 123 మంది ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 11: భారతీయ వాయుసేన కమాండోస్ సోల్జర్ పరీక్షకు సోమవారం నిర్వహించిన 1.6 కిలోమీటర్ల పరుగుపందెంలో 123 మంది అర్హత సాధించారు. విజయవాడలోని బిఆర్‌టిఎస్ రోడ్డులో సోమవారం నిర్వహించిన పరుగుపందెం పోటీలో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన 2500 మంది అభ్యర్థులు 1.6 కిలోమీటర్ల పరుగుపందెంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. వీరిలో 123 మంది దేహదారుఢ్య పరీక్ష, రాత పరీక్షలకు ఎంపికయ్యారని కలెక్టర్ బి.లక్ష్మీకాంతం తెలిపారు. వీరికి దేహదారుఢ్య పరీక్ష, రాత పరీక్షలను మంగళవారం నిర్వహించి, తుది జాబితాను సాయంత్రానికి వెల్లడిస్తారని తెలిపారు.