ఆంధ్రప్రదేశ్‌

మారిన ముహూర్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 16: వైసీపీకి చెందిన కర్నూలు ఎంపి బుట్టా రేణుక టిడిపిలో చేరే ముహుర్తం హటాత్తుగా ముందుకు జరిగింది. తొలుత వచ్చే నెల 1న మాజీ ఎమ్మెల్యేలతో కలసి పార్టీలో చేరాలని భావించారు. ఆ మేరకు పార్టీ నాయకత్వంతో కూడా రేణుక దంపతులు చర్చలు జరిపారు. అయితే, ముఖ్యమంత్రి బిజీ షెడ్యూల్, వైసీపీ నుంచి పెరుగుతున్న విమర్శల నేపథ్యంలో అప్పటివరకూ వేచిచూడకుండా వెంటనే పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. ఆ మేరకు మంగళవారం ఉదయం 10 గంటలకు చంద్రబాబునాయుడు నివాసంలోనే పార్టీలో చేరాలని నిర్ణయించారు. ఆమె భర్త నీలకంఠం కూడా దీనిని ధృవీకరించారు. కాగా, పార్టీ మారనున్న ఎంపి రేణుకను సస్పెండ్ చేయాలని వైసీపీ నాయకత్వం యోచిస్తున్నట్లు సమాచారం.