ఆంధ్రప్రదేశ్‌

2019లో టిడిపి టికెట్‌పై పోటీ: రేణుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హొళగుంద, అక్టోబర్ 24: లోక్‌సభకు 2019లో జరిగే ఎన్నికల్లో కర్నూలు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తానని ఎంపి బుట్టారేణుక పేర్కొన్నారు. కర్నూలు జిల్లా హొళగుందలో మంగళవార ఆమె విలేఖరులతో మాట్లాడుతూ తాను ఇప్పటికే టిడిపికి మద్దతు ఇచ్చానన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న రాష్ట్భ్రావృద్ది సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితురాలనై పార్టీకి మద్దతుగా నిలిచానన్నారు. త్వరలో తన భర్త బుట్టా నీలకంఠతో కలిసి టిడిపిలో చేరుతామని ఆమె పేర్కొన్నారు. టిడిపిలో చేరిన తరువాత ఎంపి పదవికి రాజీనామా చేసే విషయం గురించి ఆలోచిస్తామని అన్నారు. పదవీకాలం ఒక్క సంవత్సరం మాత్రమే ఉన్నందున ఎక్కువ హామీలు ఇవ్వలేనన్నారు. ఉన్న నిధులతో తాగు, సాగునీరు, రోడ్డు సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని అన్నారు.