ఆంధ్రప్రదేశ్‌

ప్రాణాలు తీసిన సెల్ఫీ ఇద్దరు యువతుల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, అక్టోబర్ 26: సరదాగా సెల్ఫీ తీసుకుందామనుకున్న ఇద్దరు యువతులు ప్రాణాలు కోల్పోయారు. ఒడిశాలోని రాయగడలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి లభించిన వివరాల ప్రకారం గురువారం విశాఖపట్నం నుంచి తొమ్మిది మంది రాయగడ మజ్జి గౌర మ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు బయలుదేరారు. అమ్మవారి దర్శనం తరువాత అక్కడ తీగ వం తెన వద్ద సెల్ఫీ తీసుకునేందుకు వెళ్లి న జ్యోతి, దేవి నదిలోకి జారిపడ్డారు. దీంతో మిగిలిన వారు దిక్కు తోచని స్థితిలో పడ్డారు. ఈ సంఘటనతో వారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతులు విశాఖలోని వైభవ్ జ్యుయలర్స్‌లో పనిచేస్తున్నట్టు ఆ ఇద్దరి స్నేహితులు తెలిపారు. రాయగడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.