ఆంధ్రప్రదేశ్‌

ఐలయ్యకు రక్షణ కల్పిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 26: ప్రొఫెసర్ కంచె ఐలయ్యకు మా వల్ల ప్రాణహాని ఉందని ప్రకటించారని, అయితే ఆయనకు తాము రక్షణ కల్పిస్తామని ఆర్యవైశ్య, బ్రాహ్మణ ఐక్యవేదిక నాయకులు ప్రకటించారు. గురువారం గుంటూరు బ్రాడీపేటలోని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో వేదిక నాయకులు ముత్తనపల్లి ప్రసాద్, సిరిపురపు శ్రీ్ధర్, మున్నలూరి గౌరీశంకర్ మాట్లాడుతూ ప్రజాసంఘాల నాయకులు గద్దర్, విమలమ్మ, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, తదితరులు బ్రాహ్మణులు, ఆర్యవైశ్యులను ఆధ్యాత్మిక ఫాసిస్టులుగా, సామాజిక స్మగ్లర్లుగా సమాజంలో చిత్రీకరించడం సరికాదన్నారు. దీనిపై ఐలయ్యతో పాటు ప్రజాసంఘ నాయకులందరూ చర్చకు రావాలని తాము పిలుపునిచ్చామన్నారు. ఈ చర్చకు వచ్చే వారికి తాము రక్షణ కల్పిస్తామన్నారు. ఈ చర్చల్లో ఆర్యవైశ్య, బ్రాహ్మణ వేదికకు చెందిన మహిళా నేతలు కూడా పాల్గొంటారన్నారు. అలాగే ఈనెల 28వ తేదీ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఆర్యవైశ్య, బ్రాహ్మణ సామాజిక చైతన్య ఆత్మీయ సదస్సును విజయవాడలోని జింఖానా గ్రౌండ్స్‌లో నిర్వహించనున్నామని, ఈ సదస్సులో ముస్లిం మైనార్టీ, దళిత, గిరిజన, బిసి, రెడ్డి, కాపు, వెలమా సామాజికవర్గాలకు చెందిన వారు హాజరు కానున్నారన్నారు. ఈ సమావేశంలో ఆర్యవైశ్య, బ్రాహ్మణ సంఘ నాయకులు పలువురు పాల్గొన్నారు.