ఆంధ్రప్రదేశ్‌

నిర్వాసితులకు న్యాయం జరగకుంటే ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 27: పోలవరం, వంశధార ప్రాజెక్టుల నిర్వాసితులకు న్యాయం చేయకపోతే జాతీయ స్థాయిలో ఉద్యమిస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. శుక్రవారం నాడు నారాయణ ఢిల్లీలో విలేఖరులతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వమే నిర్మించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల నిర్వాసితుల అంశాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదని ఆయన ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు భూసేకరణ సర్వే పూర్తి కాకుండానే నిర్వాసితులకు న్యాయం జరగకుండానే 2018 నాటికల్లా ప్రాజెక్టు ఏ విధంగా పూర్తవుతుందని ప్రశ్నించారు. శనివారం నాడు వంశధార నిర్వాసితుల వద్దకు సీపీఐ బృందం వెళ్లనుందని, డి.రాజా నేతృత్వంలోని ఎంపీల బృందం అక్కడ పర్యటించనుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల స్టంట్‌గానే పోలవరం అంశాన్ని వాడుకుంటున్నారని విమర్శించారు. ప్రాజెక్టు పూర్తి చేయడానికి చంద్రబాబు దగ్గర దుబాయ్ మంత్రం ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు.