ఆంధ్రప్రదేశ్‌

నీ అజెండా ఏమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 28: పోలవరం ప్రాజెక్టు సహా రాష్ట్భ్రావృద్ధిని ప్రతిపక్ష నేత అడ్డుకుంటున్నారని, ఆయన అజెండా ఏమిటో చెప్పాలని వైకాపా అధినేత జగన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలా? వద్దా? అని ప్రశ్నించారు. ఇప్పుడు పూర్తి చేయకపోతే, పోలవరం ప్రాజెక్టును ఎప్పటికీ పూర్తి చేయలేమన్నారు. ఇది పూర్తి చేయలేకపోతే అది దారుణ చరిత్రగా మిగిలిపోతుందని వ్యాఖ్యానించారు. సదావర్తి భూములను వివాదాస్పదం చేయడం ద్వారా ప్రస్తుతం ఆ భూమి తనదని తమిళనాడు అంటోందని గుర్తు చేశారు. అసలుకే మోసం తెచ్చారని, దీనికి ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. వచ్చే నిధులు కూడా ఆగిపోయాయన్నారు. నరేగా నిధులపై ఫిర్యాదు చేయడం ద్వారా కూలీలు నష్టపోతున్నారన్నారు. ప్రతిపక్ష నేత వైఖరి వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆ పార్టీ ఎంపిలు, ఎమ్మెల్యేలు లెటర్ హెడ్‌లను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. భావితరాల అభివృద్ధికి సహకరించకపోయినా, అభివృద్ధి పనులకు నష్టం కలిగించవద్దని హితవు పలికారు. మాజీ ఎంపి నామా నాగేశ్వరరావు వ్యవహారం అతని వ్యక్తిగతమని, దానిపై మాట్లాడేందుకు నిరాకరించారు. టిటిడిపి నేత రేవంత్ రెడ్డి వ్యవహారం గురించి స్పందిస్తూ, పార్టీకి రాజీనామా అంశం తనకు తెలియదని, రాజకీయాల్లో ఎదిగేందుకు కొన్ని సందర్భాల్లో అటువంటి నిర్ణయాలు తీసుకుంటుంటారని వ్యాఖ్యానించారు.