ఆంధ్రప్రదేశ్‌

పెన్నా నదిలో ముగ్గురి గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాజీపేట, అక్టోబర్ 29: కడప జిల్లా ఖాజీపేట మండల పరిధిలోని కొమ్మలూరు గ్రామం వద్ద ఆదివారం ముగ్గురు పశువుల కాపరులు పెన్నా నదిలో గల్లంతయ్యారు. అయితే వారిలో ఒకరు మృతిచెందగా, మరొకరు సురక్షితంగా బయటపడగా ఇంకొకరి ఆచూకీ లభించలేదు. వివరాలు.. కొమ్మలూరు గ్రామానికి చెందిన భూమిరెడ్డి విజయలక్ష్మి(40), సయ్యద్ కరీముల్లా, బీబీ పశువులు మేపేందుకు పెన్నానది అవతలి ఒడ్డుకు వెళ్లారు. సాయంత్రం పశువులను తీసుకుని ఇంటికి వస్తుండగా నీటి ప్రవాహంలో పశువులు కొట్టుకుపోయాయి. వాటిని రక్షించే ప్రయత్నంలో వీరు ముగ్గురు కూడా నీటిలోకి దిగి కొట్టుకుపోయారు. అయితే వారిలో విజయలక్ష్మి మృతి చెందగా కరీముల్లా జాడ కన్పించలేదు. బీబీ ప్రాణాలతో సురక్షితంగా బయటపడింది. గల్లంతైన కరీముల్లా కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు.