ఆంధ్రప్రదేశ్‌

కబ్జాకోరులు, రౌడీలతో విశాఖకు అపఖ్యాతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 31: కబ్జాకోరులు, రౌడీలు, రేపిస్టులతో విశాఖకు అపఖ్యాతి వస్తోందని, ప్రశాంత నగరంలో శాంతిభద్రతలు అధ్వాన్నంగా ఉన్నాయని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి ఆరోపించారు. మహిళలపై దాడులకు నిరసనగా వైకాపా ఆధ్వర్యంలో మంగళవారం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి మాట్లాడుతూ ప్రశాంత విశాఖ నగరంలో అశాంతి నెలకొందన్నారు. కబ్జాలు పెచ్చుమీరుతున్నాయని, రౌడీయిజం పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ విజయమ్మ గెలిస్తే అభద్రత సృష్టిస్తారంటూ టిడిపి ఎన్నికల్లో దుష్ప్రచారం చేసిందన్నారు. ఇపుడు జరుగుతున్నది ఏమిటని నిలదీశారు. పద్మలత హత్యకేసులో సాక్షాత్తూ డిఎస్పీయే ఏ-1 ముద్దాయిగా ఉన్నారని, మిస్ వైజాగ్ పోటీలను రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. విశాఖ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడాలని కోరారు. అధికార పార్టీకి పోలీసులు తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అధికారం, డబ్బే టిడిపి అజెండా అని ఎద్దేవా చేశారు. కాగా మిస్ వైజాగ్ పోటీలు రద్దు చేయాల్సిందేనని, లేనిపక్షంలో ఉద్యమిస్తామని మహిళా సంఘాలు, ప్రజాసంఘాలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. మిస్ వైజాగ్ అందాల పోటీల వ్యతిరేక ఐక్యవేదిక ఆధ్వర్యంలో విజెఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఐద్వా అధ్యక్షురాలు ప్రభావతి మాట్లాడుతూ పోటీలు రద్దు చేసే వరకు అంతా కలిసి ఉద్యమిస్తామన్నారు.

చిత్రం..విశాఖ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన నిరసనలో లక్ష్మీపార్వతి