ఆంధ్రప్రదేశ్‌

మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజుపై భూ ఆక్రమణ కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 2: మాజీ ఎమ్మెల్యే, ఎపి పిసిసి ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్‌పై పెందుర్తి పోలీసులు భూ ఆక్రమణ కేసు గురువారం నమోదు చేశారు. స్థానిక లక్ష్మీపురం గ్రామంలో ఒక దగ్గర సుమారు పదకొండు సెంట్లు స్థలం ఉంది. ఈ స్థలంలోకి గురువారం ద్రోణంరాజు శ్రీనివాస్ తన అనుచరులతో వెళ్లి మొక్కలు నాటేందుకు ప్రయత్నించారు. దీంతో తమ భూమిలోకి ద్రోణంరాజు దౌర్జన్యంగా ప్రవేశించారంటూ స్థల యజమానులు తిరుమలరాజు, నర్సింహరాజు కలిసి అడ్డుకుని, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సిఐ జె.మురళీ వివాదాస్పద స్థలం వద్దకు వెళ్లి విచారణ జరిపారు. స్థలానికి సంబంధించి ఇరువురి డాక్యుమెంట్లను తీసుకురావాల్సిందిగా ఆయన చెప్పారు. అయితే స్థల యజమానులు ఫిర్యాదు మేరకు ద్రోణంరాజుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు సిఐ మురళీ తెలిపారు.