ఆంధ్రప్రదేశ్‌

బాబు నటనకు నంది ఇవ్వాల్సిందే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (బెంజిసర్కిల్), నవంబర్ 23: అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నటనకు కచ్చితంగా నంది బహుమతి ఇవ్వాల్సిందేనని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. మొదటి నుంచీ రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్న బాబు ఇప్పటికీ మారండం లేదని, రైతులకు అన్నింటా అన్యాయం చేస్తూ రైతు వ్యతిరేకిగా మరోసారి నిరూపించుకున్నారని విమర్శించారు. నగరంలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పార్థసారథి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న మోసాలకు అద్దూఅదుపూ లేకుండా పోయిందన్నారు. చంద్రబాబును కేవలం పొగిడేందుకే అసెంబ్లీని వేదికగా వినియోగించుకుంటున్నారని విమర్శించారు. రైతు రుణమాఫీ, పోలవరం, నిరుద్యోగ భృతి విషయంలో మోసగించిన బాబు రోజుకో ప్రకటనతో రాష్ట్ర ప్రజల ముందు నటిస్తున్నారని, అందుకు బాబుకు నంది అవార్డు ఇవ్వచ్చన్నారు. గతంలో రైతులు ధర్నాలు చేస్తే పోలీసులతో కాల్చి చంపించిన బాబు, నేడు రైతులు నష్టపరిహారం కోసం ఉద్యమిస్తే ఆత్మహత్యలకు పురికొల్పారని మండిపడ్డారు. ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకెళ్తే తమకు న్యాయం జరుగుతుందని బయల్దేరిన రైతులను చంద్రబాబు ఆత్మహత్య యత్నానికి గురిచేశారన్నారు.
అసెంబ్లీకి ప్రతిపక్షం రాలేదు కనుక ప్రజా సమస్యలన్నీ పరిష్కారవౌతాయని గొప్పగా మాట్లాడిన టీడీపీ నేతలు రైతుల సమస్యలను ఎక్కడ పరిష్కరించారో చెప్పాలన్నారు. సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన రైతులను ఎందుకు భయపెట్టారో చెప్పాలన్నారు. రైతుబిడ్డగా చెప్పుకోవటమే కాదని, ఆలోచనా విధానాలు కూడా రైతులకు మేలుచేసేలా ఉండాలని హితవు పలికారు. రైతులను చంపిన వారు రైతుబిడ్డ ఎలా అవుతారని ప్రశ్నించారు. రైతులకు మేలు చేయాల్సిన ప్రభుత్వం గొంతెత్తే వారిపై అక్రమంగా కేసులు బనాయిస్తోందన్నారు. పోలీసులను బాగా ఉపయోగించుకొని రైతులను వేధిస్తున్నారని విమర్శించారు. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఎప్పటిలోగా చెల్లిస్తారో చెప్పాలన్నారు.