ఆంధ్రప్రదేశ్‌

పాడేరు ఎమ్మెల్యేకు జగన్ ఫోన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, నవంబర్ 25: విశాఖపట్టణం జిల్లా పాడేరు శాసనసభ్యురాలు గిడ్డి ఈశ్వరితో వైసీపీ అధినేత జగన్ శనివారం ఫోన్‌లో మాట్లాడారు. ఆమె వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో చేరనున్నారన్న వార్తల నేపథ్యంలో జగన్ పాదయాత్ర ప్రారంభానికి ముందే కర్నూలు జిల్లా వెల్దుర్తి సమీపంలోని జాతీయ రహదారి పక్కనే ఏర్పాటు చేసిన రాత్రి బస ప్రాంతం నుంచి ఆమెతో మాట్లాడినట్లు పార్టీవర్గాల ద్వారా తెలిసింది. అనకాపల్లి పార్లమెంటు పార్టీ ఇన్‌చార్జి జగన్‌ను కలిసి గిడ్డిఈశ్వరి అంశంపై చర్చించినట్లు సమాచారం. గిడ్డి ఈశ్వరితో ఫోన్‌లో మాట్లాడిన జగన్ సమస్య ఏంటో తన వద్దకు వచ్చి చెప్పాలని ఆమె కు సూచించినట్లు తెలుస్తోంది. ఇంతకాలం తాను చెప్పిం ది పట్టించుకోకుండా ఇప్పుడు పార్టీ మార్పు వార్తలు వచ్చాయని ఫోన్ చేశారే కాని తన సమస్య పరిష్కరించడానికి కాదన్నట్లుగా మాట్లాడినట్లు తెలుస్తోంది.