ఆంధ్రప్రదేశ్‌

బీసీలపై బాబు కపట ప్రేమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోనెగండ్ల, నవంబర్ 28: ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీలపై కపటప్రేమ కనబరుస్తున్నారని వైసీపీ అధినేత వైఎస్.జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చి బీసీలను మోసం చేశారన్నారు. ప్రజా సంకల్పయాత్ర 20వ రోజు మంగళవారం కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో కొనసాగింది. ఈ సందర్భంగా గొనెగండ్లలో జరిగిన సభలో జగన్ మాట్లాడుతూ బీసీలపై ప్రేమ అంటే ఇస్తీ పెట్టెలు ఇవ్వడం కాదన్నారు. నాలుగేళ్ల పాలనలో బాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేరలేదన్నారు. ఇలాంటి మోసకారి సీఎం మనకు అవసరమా అని అన్నారు. మళ్లీ ఎన్నికలు వస్తున్నాయని, చంద్రబాబు మళ్లీ మీ వద్దకు వచ్చి అబద్దాలు చెప్పి అధికార పీఠం ఎక్కాలని చూస్తున్నారన్నారు. ఇలాంటి మోసకారికి తగిన బుద్ధిచెప్పాలన్నారు. టీడీపీ హయాంలో అన్ని ధరలు పెరిగిపోయాయని జగన్ అన్నారు. విద్యుత్ చార్జీలు పెరిగాయన్నారు. రేషన్ దుకాణాల్లో బియ్యం తప్ప ఏమీ ఇవ్వడం లేదన్నారు. రుణమాఫీ పేర రైతులు, డ్వాక్రా మహిళలను మోసం చేశారన్నారు. రాజకీయ నాయకులకు విశ్వసనీయత ఉండాలని, అలాంటి రాజకీయాలు తీసుకొస్తానన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే దివంగత నేత వైఎస్ పాలను తలపించేలా అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తామన్నారు. 20వ రోజు పాదయాత్రలో జగన్ 14 కిలోమీటర్ల దూరం నడిచారు. దారి పొడవునా రైతులు, మహిళలు, కూలీలు తమ సమస్యలను జగన్‌తో ఏకరువు పెట్టారు. పాదయాత్రలో మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, బుగ్గన రాజేంద్రరెడ్డి, బివై రామయ్య, గౌరువెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..గోనెగండ్లలో మాట్లాడుతున్న జగన్