ఆంధ్రప్రదేశ్‌

సంగీత కళాశాలకు నిధులు కేటాయించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 29: విజయనగరంలోని ప్రభుత్వ సంగీత కళాశాలకు నిధులు కేటాయించాలని ఎమ్మెల్సీ పివి మాధవ్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర శాసన మండలిలో జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.సుశీల వంటి వారు చదువుకున్న కళాశాల అని, ఆదిభట్ల నారాయణ దాసు ప్రిన్సిపాల్‌గా వ్యవహరించారని గుర్తు చేశారు. అటువంటి కళాశాల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, గతంలో రెండు కోట్ల రూపాయలు కేటాయించినా, విడుదలకు నోచుకోలేదన్నారు. కశాళాలకు పూర్వవైభవం వచ్చేలా, నిధులు కేటాయించాలని కోరారు.