ఆంధ్రప్రదేశ్‌

‘జగన్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు పెడతా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 29: ఒక గిరిజన మహిళా ప్రజాప్రతినిధిని అని కూడా చూడకుండా తనను మానసిక క్షోభను గురిచేసిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు పెడతానని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఎమ్మెల్యే ఈశ్వరి మాట్లాడుతూ తాను ముఖ్యమంత్రి చంద్రబాబుకు మద్దతు పలికిన వెంటనే జగన్ తన పేపర్, టీవీ ఛానల్‌లో తనను బదనాం చేస్తూ కథనాలు వచ్చేలా చేశారన్నారు. సాక్షి పేపర్, టీవీ ఛానల్‌పై చివరి వరకు పోరాటం చేస్తామన్నారు. మానసికంగా నలిగిపోతున్న తనను మరింత బదనాం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. జగన్ తనకు ఇచ్చిన మాట తప్పడం వల్లే ముఖ్యమంత్రి చంద్రబాబుకు మద్దతు పలికానని, తాను పడ్డ కష్టం, చేసిన త్యాగాలు ప్రతిపక్ష నేతకు కనపడలేదా అంటూ ప్రశ్నించారు. కేవలం జగన్ సీఎం అయ్యేందుకే పార్టీ పెట్టారని, లేకపోతే ఆయన కాంగ్రెస్‌లోనే ఉండేవారని అన్నారు. తాను పడ్డ కష్టాన్ని ప్రతిపక్ష నేత గుర్తించక పోయినా ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తించి తనకు తప్పక న్యాయం చేస్తారని అన్నారు. ఇప్పటికే గిరిజన ప్రాంతంలో సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటుకు హామీ ఇచ్చారని, నియోజకవర్గ అభివృద్ధికి వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారని ఈశ్వరి పేర్కొన్నారు.