ఆంధ్రప్రదేశ్‌

ఏపీని కబళించాలని బీజేపీ చూస్తోంది: జేసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 30: ఒక్కో రాష్ట్రాన్ని కబళిస్తున్నట్లుగానే ఏపీలో కూడా బీజేపీ చేయాలనుకుంటోందని ఎంపీ జెసీ దివాకర రెడ్డి ఆరోపించారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అయితే తమ సీఎం సామాన్యుడు కాదని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం లేఖ రాయడం దురదృష్టకరమన్నారు. సీఎం తనను తాను తక్కువ చేసుకుని పోలవరం విషయంలో కేంద్రానికి వివరించారన్నారు. కేంద్రం రాజకీయాలను పోలవరం విషయంలో చొప్పించినట్లు కనిపిస్తోందన్నారు. పోలవరం ఆపేస్తే, ఆంధ్రుల పౌరుషం ఏమిటో కేంద్రానికి తెలుస్తుందన్నారు. కేంద్రానికి టీడీపీపై దుర్బుద్ధి ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. పోలవరం ఆపితే చంద్రబాబు ప్రభావం తగ్గుతుందని కేంద్రం భావిస్తోందని, కానీ అలా చేస్తే, దేశంలో పెద్ద తిరుగుబాటు రావచ్చన్నారు. సమస్యలు ఏమైనా ఉంటే, మాట్లాడి పరిష్కరించుకోవాలని కానీ, టెండర్లు ఆపేయమని లేఖలు రాస్తారా? అని ప్రశ్నించారు. రాష్టమ్రేమన్నా కేంద్రానికి జాగీర్దారా? అని మండిపడ్డారు. కేంద్రానికి అనుమానాలు రావడం సహజమేనని, కానీ ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. మేం బానిసలమా? అంటూ ప్రశ్నించారు. ఏపీ సర్కార్ నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తోందని, కేంద్రం తీరుతో తమకూ అనుమానాలు కలుగుతున్నాయన్నారు.