ఆంధ్రప్రదేశ్‌

టీడీపీలో బాబే నెంబర్ వన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (బెంజిసర్కిల్), నవంబర్ 30: పవన్ కల్యాణ్ కేవలం సినిమాలకే పనికి వస్తారని, రాజకీయాల్లోకి పనికి రాడని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. తెదేపాలో ఎప్పటికీ చంద్రబాబు ఒక్కడే నెంబర్ వన్‌గా ఆయన అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం లాబీల్లో వైకాపా ఎమ్మెల్యేలు చేరిక, పవన్ కళ్యాణ్ రాజకీయాలపై ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య అసక్తికర సంభాషణ జరిగింది. పవన్ కల్యాణ్‌కు ఆయన అన్న చిరంజీవే పెద్ద శాపంగా జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం వంటి పొరపాట్లు చేయడంతోనే ఆయన పతనమయ్యారని, విత్తనాలు వేస్తే సరిపోదని, పంట పండాలి కదా అని అన్నారు. పవన్ రాజకీయాలకు సరిపోడని కేవలం ఆయన సినిమాలకే పరిమితం అయితే మంచిదని, వచ్చినా తనకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. రాజకీయాల్లో పవన్ ప్రభావం అంతగా ఎమీ ఉండదన్నారు. వైకాపా నుండి తెదేపాలోనికి వస్తున్న గురునాథరెడ్డి ఎమ్మెల్యే సీటు అడగడం లేదని, ప్రస్తుత ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, తాను బాబు నాయకత్వంలోనే పని చేయాలన్నారు. రాజకీయాల్లో అందరిపైనా ఆరోపణలు రావడం సహజమన్న ఆయన మిస్సమ్మ బంగ్లా విషయం కోర్టు పరిధిలో ఉందన్నారు. వీరితో పాటు పయ్యావుల కేశవ్, పలువురు ఎమ్మెల్యేలు వైకాపా నుండి వస్తున్న వారి గురించి చర్చించు కోవడం కనిపించింది. ముఖ్యంగా పవన్ అనంతపురం నుండి పోటీ చేస్తాడనే ప్రచారంపై చర్చ ఆసక్తికరంగా జరిగింది.