ఆంధ్రప్రదేశ్‌

కాపుజాతిని దగా చేస్తున్న చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడ్లవల్లేరు, నవంబర్ 30: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాపుజాతిని దగా చేస్తున్నారని కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు. గురువారం ఆయన కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో ఒక ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన సందర్భంగా విలేఖర్లతో మాట్లాడుతూ నేను మారాను అని చెప్పి కాపుల ఓట్లతో గద్దెనెక్కిన చంద్రబాబు నేడు తమ జాతికి తీరని ద్రోహం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో రిజర్వేషన్లు కల్పిస్తానని ఇచ్చిన హామీ అతీగతీ లేకుండా పోయిందని విమర్శించారు. తామేమీ రిజర్వేషన్ల కోసం రిజర్వేషన్లు కావాలని అడగలేదన్నారు. అన్ని రాజకీయ పార్టీలు కాపులను మోసం చేస్తూ వచ్చాయన్నారు. సుమారు 20 సంవత్సరాల పైబడి రిజర్వేషన్ల ప్రస్తావన లేకుండానే కాలక్షేపం చేస్తున్న నేపథ్యంలో 2014 సాధారణ ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు పర్చాలని డిమాండ్ చేస్తున్న తమను పోలీసులతో వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమాన్ని అణచివేయించడం, బూటు కాళ్లతో తన్నించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు ఓట్లు వేసింది తన్నులు తన్నించుకోవడం కోసమా అని ప్రశ్నించారు. రిజర్వేషన్ల విషయంలో నిత్యం అబద్ధాలు చెబుతూ కాపులను మభ్య పెడుతున్నారన్నారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో సైతం కాపుల పక్షాన ఉన్నానని చెబుతూ ఆ ప్రాంతంలో జరిగే ఉద్యమాన్ని అణచి వేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్ని మోసపూరిత విధానాలు అవలంబించినా కాపుజాతి ఐక్యతతో రిజర్వేషన్లను సాధిస్తామని ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు.