ఆంధ్రప్రదేశ్‌

బాబుకు మంచి బుద్ధి ఇవ్వాలని స్వామిని ప్రార్థిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 1: చిత్తూరు జిల్లాలో గాలేరి-నగరి రిజర్వాయర్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసేలా ముఖ్యమంత్రి మనసు మార్చాలని ఆ తిరుమల శ్రీనివాసుడిని ప్రార్ధిస్తానని నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. నగరి సత్రవాడ నుంచి ఎమ్మెల్యే రోజా చేపట్టిన పాదయాత్ర శుక్రవారం రాత్రి తిరుమలకు చేరుకుంది. ఈసందర్భంగా ఉదయం తిరుచానూరు వద్దకు చేరుకున్న ఆమె ముందుగా శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం అక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరగా తిరుపతి ఎంపి వరప్రసాద్, వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి, ఇతర పార్టీ ముఖ్య నాయకులు తోడురాగా తిరుపతిలో ముఖ్యకూడళ్లమీదుగా అలిపిరికి చేరుకున్నారు. అలిపిరి వద్ద ప్రత్యేక పూజలు చేసి తిరుమలకు కాలినడకన బయలుదేరారు. ఈ సందర్భంగా దారి పొడువునా ఆమెను చూసేందుకు ప్రజలు ఆసక్తిని చూపారు. రోడ్డు పక్కన ఉన్న వారిని ఎమ్మెల్యే రోజా చేతులు కలుపుతూ పలుకరించారు.