ఆంధ్రప్రదేశ్‌

విద్యార్థినిపై పెట్రోల్ పోసి, నిప్పంటించిన దుండగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, డిసెంబర్ 1: విజయనగరం పట్టణంలోని కెఎల్ పురం సమీపంలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థినిపై దుండగులు పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహం సమీపంలో పోలయ్యపేట వద్ద నివసిస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థి ముదునూరు అశ్విని (24) శుక్రవారం సాయంత్రం నడక కోసం కెఎల్ పురం వైపు వెళ్లింది. సాయంత్రం ఆరు గంటల సమయంలో ఆమెపై దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. సంఘటనను గమనించిన స్థానికులు ఆమెను జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రూరల్ ఎస్సై రామకృష్ణ తెలిపారు.