ఆంధ్రప్రదేశ్‌

కర్ణాటకకు చెందిన ముగ్గురు మోసగాళ్లు అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 8: కర్ణాటక రాష్ట్రానికి చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి 130 నకిలీ రూ.500 నోట్లు, 950 నకిలీ బంగారు లక్ష్మీ కాయిన్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి డీఎస్పీ మునిరామయ్య వెల్లడించారు. తిరుపతి క్రైం పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కెఎ 53, పి0126 నెంబరుగల టయోటా కారు శుక్రవారం తెల్లవారు జామున 4.30 గంటలకు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నుంచి టౌన్‌క్లబ్ జంక్షన్ వైపు వస్తుండగా ఆప్రాంతంలో క్రైమ్ సీఐ రసూల్ సాహెబ్, రక్షక్ సిబ్బంది, బ్లూకోట్స్ సిబ్బందితో వాహనాలను తనిఖీ చేస్తున్నారన్నారు. వీరిని గమనించిన బెంగళూరుకి చెందిన డి.ఎల్.వెంకటాచారి (48), కోలార్ జిల్లా, కారహల్లికి చెందిన కెఎస్ ప్రభాకర్, సి.రామకృష్ణ (50)లు కారు నుంచి దిగి పారిపోవడానికి ప్రయత్నించారు. దీనితో వారిని అదుపులోకి తీసుకుని కారును తనిఖీ చేయడంతో నకిలీ నోట్లు, నకిలీ బంగారు కాయిన్స్ దొరికాయన్నారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో వీరు ప్రజలను మోసం చేస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. వీరిని అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. విలేఖరుల సమావేశంలో సీఐలు సుధాకర్, రసూల్ సాహెబ్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.