ఆంధ్రప్రదేశ్‌

వరల్డ్ మెమరీ పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు మంత్రి నక్కా అభినందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 11: రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు (పి.మధుకర్, సాయిజ్యోతి, మమత, జె.జ్యోతి) చైనాలో జరిగిన వరల్డ్ మెమరీ పోటీల్లో పాల్గొని 4వ స్థానంలో నిలిచారు. వీరు సోమవారం మంత్రి నక్కా ఆనందబాబును కలవగా, మంత్రి వారిని అభినందించి, సన్మానించారు. వరల్డ్ మెమరీ చాంపియన్‌షిప్-2017 చైనాలో జరిగిన పోటీల్లో 102 దేశాలు పాల్గొనగా ఇండియా తరపున వెళ్లిన విద్యార్థులు 4వ స్థానంలో నిలిచారు. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించి దేశానికి, రాష్ట్రానికి పేరు తీసుకుని రావాలని మంత్రి ఆకాంక్షించారు. రాష్టప్రతి, ఉప రాష్టప్రతి అపాయింట్‌మెంట్ ఇచ్చారని, త్వరలో వారిని కలవనున్నట్టు విద్యార్థులు తెలిపారు.