ఆంధ్రప్రదేశ్‌

రాహుల్ ఎన్నికపై రఘువీరా హర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 11: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా రాహుల్‌గాంధీ ఏకగ్రీవంగా ఎన్నిక పట్ల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి సోమవారం ఓ ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. గాంధీ, నెహ్రూ కుటుంబంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టిన 5వ వ్యక్తిగా రాహుల్‌గాంధీ నిలుస్తారన్నారు. ప్రస్తుతం అమేధీ నియోజకవర్గం ఎంపీగా ఉన్న రాహుల్‌గాంధీ రాజకీయాల్లోకి వచ్చిన 13 సంవత్సరాల తరువాత అధ్యక్ష పీఠంపై కూర్చోబోతున్నారని అన్నారు. 2019కి రాహుల్‌గాంధీనే కాబోయే ప్రధాని అని ధీమా వ్యక్తం చేశారు.