ఆంధ్రప్రదేశ్‌

రాళ్లు పడి ఇద్దరు కార్మికుల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొబ్బిలి(రూరల్), డిసెంబర్ 12: మాంగనీస్ క్వారీ కింద మోటార్ పనులు చేస్తుండగా ఇద్దరు కార్మికులపై పైనుంచి బండరాళ్లు పడటంతో అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పారాది పంచాయతీ పరిధి బంకురువానివలసలో ఉన్న మాంగనీస్ క్వారీ పనులను చేసేందుకు కొంతమంది కార్మికులు మంగళవారం వెళ్లారు. సుమారు 200 అడుగుల లోతులో ఉన్న క్వారీ అడుగు నుంచి నీటిని తోడే మోటారు ఏర్పాటు చేసేందుకు మరడాన వెంకటరావు(35), లోపింటి అంజయ్య(55) దిగారు. పనులు చేస్తుండగా పైనుంచి బండరాళ్లు వీరిపై పడటంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. కార్మికులు దిగువన పని చేస్తుండగా అదే సమయంలో బ్లాస్టింగ్ చేయడంతో బండరాళ్లు వీరిపై పడినట్లు స్థానికులు చెబుతున్నారు. సంఘటన విషయం తెలిసిన వెంటనే గనుల శాఖామంత్రి సుజయ్‌కృష్ణరంగారావు, కలెక్టర్ వివేక్‌యాదవ్, బొబ్బిలి డీఎస్పీ సౌమ్యలత, ఆర్డీవో సుదర్శనదొర ప్రమాదస్థలాన్ని పరిశీలించి స్థానికుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బాడంగి సిహెచ్‌సికి తరలించి బొబ్బిలి డీఎస్పీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.