ఆంధ్రప్రదేశ్‌

బిడ్డను చంపి తల్లి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసన్నపేట, డిసెంబర్ 14: నాలుగేళ్ల సంసారంలో భర్తతో జీవనం సాగించిన తాను కేవలం ఒకే ఒక మాటకు మనస్తాపం చెందిన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకోవడమే కాకుండా తన 9 నెలల బిడ్డను చంపడం స్థానికులను కలచివేసింది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం గొట్టిపల్లిలో నివాసం ఉంటున్న సిహెచ్.కృష్ణప్రసాద్, గౌతమి(26) దంపతులు. అవంతిక, మనోహర్ వీరి పిల్లలు. ఇటీవల మగ బిడ్డకు జరిగిన బారసాలలో అత్తింటివారు పెట్టిన బంగారు గొలుసు కనిపించకపోవడంతో గౌతమిని అత్తమామలు మందలించారని గ్రామస్థుల కథనం. అయితే బారసాల జరిగిన మరుసటి రోజే బంగారు గొలుసు దొరకడంతో అందరూ ఆనంద పడినప్పటికీ గౌతమి మనస్తాపం చెందడంతో ఇంటిలోనే గురువారం ఉదయం తన 9 నెలల బిడ్డ మనోహర్‌ను చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకుందని గ్రామస్థులు తెలిపారు.