ఆంధ్రప్రదేశ్‌

టిటిడి అనుబంధ ఆలయాల్లో దివ్య పారాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 13 : టిటిడి అనుబంధ ఆలయాల్లో వేదపారాయణంతో పాటు దివ్యప్రబంధాన్ని ప్రతినిత్యం పారాయణం చేసేందుకు స్థానికంగా ఉన్న పారాయణదారుల సేవలను వినియోగించుకోవాలని టిటిడి ఇఓ సాంబశివరావు అధికారులను కోరారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో సోమవారం సీనియర్ అధికారులతో ఇఓ వారపు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇఓ మాట్లాడుతూ భక్తులకు గదుల్లో వేడినీళ్లు అందుబాటులో ఉంచాలన్నారు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్ (ఎస్వీబీసీ) స్వయం సమృద్ధి సాధించుకునేలా ప్రణాళికలు తయారు చేయాలని సంబంధిత అధికారులను ఇఓ ఆదేశించారు. ఇదిలావుండగా తిరుమల జెఇఓ శ్రీనివాసరావు తిరుమలలో అధికారులతో సమీక్షిస్తూ బూందీ పోటును రసాయనాలు వాడకుండా శుభ్రం చేయడంపై దృష్టి సారించాలని కోరారు.