ఆంధ్రప్రదేశ్
నేడు చైనాకు చంద్రబాబు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 25 June 2016
విజయవాడ, జూన్ 24: విదేశీ పెట్టుబడుల కోసం పలు కంపెనీలతో ఒప్పందాలను ఖరారు చేసుకునేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నేతృత్వంలో ప్రతినిధి బృందం శనివారం రాత్రి ఢిల్లీ నుంచి చైనాకు బయలుదేరి వెళ్లనుంది. ఈ పర్యటన ఖర్చుల కోసం కోటి 20 లక్షలు మంజూరు చేసిన ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కోటి రూపాయలు విడుదల చేసింది. చంద్రబాబుతో పాటు మంత్రులు యనమల రామకృష్ణుడు, పి.నారాయణ, ఐటి కార్యదర్శి ప్రద్యుమ్న, రాజధాని అమరావతి అభివృద్ధి ఛైర్మన్ లక్ష్మీ పార్థసారథి చైనా వెళుతున్నారు. ముఖ్యమంత్రి బృందం కార్యక్రమాలు భారత కాలమాన ప్రకారం ఆదివారం రాత్రి 7.30 నుంచి ప్రారంభమవుతాయి. మూడు రోజులపాటు ఈ బృందం చైనాలో పర్యటిస్తుంది.