ఆంధ్రప్రదేశ్‌

భీమవరంలో బిజెపి కార్యాలయం ముట్టడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, మార్చి 19: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని ప్రత్యేక హోదా ఐక్యకార్యాచరణ కమిటి సోమవారం నాడు ముట్టడించింది. స్ధానిక మున్సిపల్ కార్యాలయం నుంచి ర్యాలీగా వచ్చిన ఈ ఐక్య కార్యాచరణ కమిటి తెలుగు ప్రజలను మోసం చేసిన బిజెపి, వెంకయ్య నాయుడుకి వ్యతిరేకంగ నినాదాలు చేసుకుంటూ బిజెపి కార్యాలయం వద్దకు చేరుకున్నారు. మోదీ డౌన్ డౌన్ అని నినాదాలు చేసే సమయంలో అక్కడే ఉన్న బిజెపి పట్టణ అధ్యక్షులు కాయిత సురేంద్ర వారికి ఆ విధంగ నినాదాలు చెయ్యవద్దని విజ్ఞాపనచేశారు. అయినా ప్రత్యేక హోదా ఐక్య కార్యాచరణ కమిటి తనదైన శైలిలో స్పందించింది. కన్వీనర్ వడ్డి సుబ్బారావు, దళిత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గంటా సుందర్‌కుమార్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అధికారం కోసం అబద్ధాలు ఆడిందన్నారు. శ్రీ వారి సాక్షిగా హోదా ఇస్తామని ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ ఆ శ్రీవారినే మోసం చేసిన ఘనుడన్నారు. హోదా ఉద్యమాన్ని తీవ్రంగా ముందుకు తీసుకువెళ్ళి బిజెపి ఎలా మోసం చేసిందో వివరిస్తామన్నారు.