ఆంధ్రప్రదేశ్
అవిశ్వాసమంటే ఎందుకంత భయం?: యనమల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 20 March 2018
విజయవాడ, మార్చి 19: అవిశ్వాస తీర్మానమంటే బీజేపీ ఎందుకు భయపడుతోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. సొంత పార్టీ సభ్యులపై నమ్మకం లేకనే భయపడుతున్నారా? అంటూ ఎద్దేవా చేశారు. మోదీపై అసంతృప్తితో ఉన్న బీజేపీ ఎంపీలు అవిశ్వాసంపై చర్చ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారని బీజేపీ భయపడుతోందని ఆయన సోమవారం ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చకు అవసరమైన సభ్యులు సంతకాలు పెట్టి, సభ్యులు లేచి నిలబడితే ఎలాంటి సంకోచం లేకుండా నోటీసును ఆమోదించాలని, చర్చకు తేదీను నిర్ణయించాలని గుర్తుచేశారు. దీనికి విరుద్ధంగా వ్యవహరించడం అప్రజాస్వామికం, పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమని ఆయన ఖండించారు.