ఆంధ్రప్రదేశ్‌

సదావర్తి భూములపై హైకోర్టులో పిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 25: అమరావతిలోని సదావర్తి భూములను నామమాత్రపు ధరకే ఏపి ప్రభుత్వం విక్రయించినట్లు వచ్చిన అభియోగాలపై న్యాయ విచారణకు ఆదేశించాలని కోరుతూ అఖిల భారత బ్రాహ్మణ సమాఖ్య యువజన విభాగం అధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. సదావర్తి భూముల అమ్మకాలను రద్దు చేయాలని, దేవాలయాలు, సత్రాలు, మఠాలకు చెందిన భూములను విక్రయించకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన కోరారు. ఈ పిటిషన్‌ను 27వ తేదీన హైకోర్టు విచారించనుంది. ఈ పిటిషన్‌లో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, దేవాదాయ శాఖ కమిషనర్, ప్రాంతీయ సంయుక్త కమిషనర్ , ఎమ్మెల్యే డాక్టర్ కె శ్రీ్ధర్ తదితరులను ప్రతివాదులుగా చేర్చారు.