ఆంధ్రప్రదేశ్‌

ఎఎస్పీ మృతిపై సిబిసిఐడి విచారణ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: పాడేరు ఎఎస్పీ శశికుమార్ అనుమానాస్పద మృతిపై సిబిసిఐడి అధికారులు శుక్రవారం ఉదయం విచారణ ప్రారంభించారు. పాడేరులోని ఆయన అధికారిక నివాసంలో సాక్ష్యాధారాలను సేకరించారు. ఎఎస్పీ ఆత్మహత్య చేసుకున్నారా? ప్రమాదవశాత్తూ రివాల్వర్ పేలిందా? అన్న అనుమానాలు రావడంతో ఈ ఘటనపై ముఖ్యమంత్రి సిబిసిఐడి విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. తల్లిదండ్రులు కుదిర్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకే ఈ 30 ఏళ్ల యువ ఐపిఎస్ అధికారి ఆత్మహత్య చేసుకున్నాడన్న వాదన బలంగా వినిపిస్తోంది. తమిళనాడులోని సేలం జిల్లా నుంచి వచ్చిన శశికుమార్ కుటుంబ సభ్యులను కూడా సిఐడి పోలీసులు విచారిస్తారు.